spot_img
Homeక్రీడలుShreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. త్యాగంలో శిబి చక్రవర్తిని మించిపోయావ్..

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. త్యాగంలో శిబి చక్రవర్తిని మించిపోయావ్..

Shreyas Iyer : ఎవరైనా ఒక ఆటగాడు సెంచరీకి దగ్గరగా ఉంటే.. ఆరు నూరైనా సరే దానిని పూర్తి చేయాలనుకుంటాడు. అది వ్యక్తిగత రికార్డు కాబట్టి దానికోసం తహతహలాడుతుంటాడు. అలాంటి సందర్భంలో జట్టు కోసం ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగత రికార్డులే క్రికెటర్ల ఆటను ప్రపంచానికి తెలిసేలా చేస్తాయి. కానీ పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇందుకు విరుద్ధంగా ఆలోచించాడు. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన సెంచరీని త్యాగం చేశాడు. జట్టు అవసరాల దృష్ట్యా తన సెంచరీ కంటే.. పరుగులు రావడమే ముఖ్యమని భావించాడు. అందువల్లే పంజాబ్ జట్టు ఓడే మ్యాచ్లో గెలిచింది. అందుకే అంటారు నాయకుడు అంటే నడిచేవాడు కాదు.. నడిపించేవాడని.. దానిని నిజం చేసి చూపించాడు శ్రేయస్ అయ్యర్.

Also Read : నా శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదు.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్

సెంచరీ వదులుకున్నాడు

గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ 42 బంతుల్లోనే 97* పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు ఉంటే.. 9 సిక్సర్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మైదానంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి… అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి చివరి ఓవర్ కు ముందే అయ్యర్ 97 పరుగులు చేశాడు. అయితే స్ట్రైకర్ గా ఉన్న శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇవ్వకపోవడంతో మూడు అంకెల స్కోర్ చేయలేకపోయాడు. కచివరి ఓవర్లో శశాంక్ సింగ్ 5 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 23 పరుగులు చేశాడు. ఫలితంగా పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. శశాంక్ సింగ్ ఇవ్వకపోవడంతో అయ్యర్ అభిమానులు అతనిపై మండిపడ్డారు. అయితే దీనిపై శశాంక్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు..” అయ్యర్ సెంచరీ చేయకపోవడానికి కారణం నేను కాదు. ఎందుకంటే నన్ను స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు. భారీగా పరుగులు చేయాలని సూచించాడు. అందువల్లే నేను అలా చేయాల్సి వచ్చింది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. దీంతో నేను అతడు చెప్పినట్టే చేశాను.. టీమ్ మేనేజ్మెంట్ నాకు అండగా నిలిచింది. ఎలాంటి షాట్లు ఆడలో నా ఇష్టానికే వదిలేసింది. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు కోసం మాత్రమే అయ్యర్ ఆలోచించాడు. అయ్యర్ అలా ఆలోచించడం వల్లే పంజాబ్ గెలిచింది. డగ్ అవుట్ లో అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. కానీ అతడు తన స్వార్థం చేసుకోకుండా జట్టు కోసం మాత్రమే ఆలోచించాడని” శశాంక్ సింగ్ వ్యాఖ్యానించాడు..

Also Read : సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.. కట్ చేస్తే ఇప్పుడతడు టీమిండియా పాలిట కొత్త దేవుడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper