Samantha Ruth Prabhu : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏదో ఒక సంఘటనతో వార్తల్లో వ్యక్తి అవుతున్నారు. ఆ మధ్య మయోసైటీస్ కు గురయ్యారని.. తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దానికోసం చికిత్స తీసుకుంటున్నారని.. విదేశాలకు వెళ్తోంది అందుకేనని పుకార్లు షికార్లు చేశాయి. వాటికి బలం చేకూర్చే విధంగానే సమంత చేతికి కాన్యూలతో కనిపించింది. యశోద, శాకుంతలం, ఖుషి అనే చిత్రల్లో నటించింది. ఖుషి సినిమాలో ఆమె విజయ్ దేవరకొండ తో నటించిన సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా సమంత ఓ నీటి కొలనులో ఈత దుస్తులతో కనిపించి సందడి చేశారు. ఆ ఫోటోలను తన సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన రెండు రోజులకే.. అర్బన్ కిసాన్ అనే సంస్థకు సంబంధించిన ప్రకటన లో కనిపించి సందడి చేసింది. ఆ ప్రకటనలో సమంత చాలా చలాకీగా కనపడింది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ ప్రకటనలో నటించి తన అభిమానులను అలరించింది. ఆ తర్వాత సమంత గురించి ఎటువంటి అప్డేట్ లేదు.
సోమవారం అకస్మాత్తుగా ఉదయం తిరుమలలో సమంత కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం తెల్లవారుజామున తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సమంత దర్శించుకున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరుడి సేవలో తరించారు. సాధారణంగా తన నటించిన సినిమా విడుదలకు ముందు సమంత తిరుమల కి వస్తుంటారు. కానీ ఆమె నటించిన సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ అనూహ్యంగా ఆమె తిరుమల వచ్చారు. ఒకరి మాత్రమే కాకుండా తన వెంట ప్రీతం జూల్కర్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఇతను ఎవరో కాదు సమంత వ్యక్తిగత సహాయకుడు. గతంలో ప్రీతంతో కలిసి సమంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వడానికి ప్రీతం కూడా ఒక కారణమని అప్పట్లో పుకార్లు వినిపించాయి. ఈ విషయంలో నాగచైతన్య అభిమానులు ప్రీతం ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ తర్వాత కొంతకాలం వరకు ప్రీతం కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా సమంతతో సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని అతడు దర్శించుకోవడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా సమంత ప్రీతంతో తిరుమల ఎందుకు వచ్చారు అనేది అంతుపట్టకుండా ఉంది. మరి దీనిపై సమంత ఏమైనా క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.