Kamareddy News
Kamareddy News: అతడో ముసలివాడు. పసిపాపలను ఆడించాల్సిన వయసు. తాతయ్య అని ముద్దుగా పిలిచినా మురిసిపోయే దుర్మార్గుడు ఓ పసిపాపను చిదిమేయాలనిచూశాడు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేయాలని చూశాడు. సకాలంలో స్థానికులు స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాలిక ప్రమాదం నుంచి తప్పించుకుంది. లేదంటే చిన్నారి బతుకు తెల్లారిపోయేది. అన్యం పుణ్యం ఎరగని బాలికలను లక్ష్యంగా చేసుకునే పాపాత్ములు ఇంకా ఉండటం దారుణం.
Kamareddy News
కామారెడ్డి పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన యాచకులు కొద్ది రోజులుగా పట్టణంలో ఉండి అడుక్కుని పొట్టపోసుకుంటున్నారు. వారికి ఓ మూడేళ్ల కూతురు ఉంది. ఆమె మంగళవారం కిరాణా దుకాణానికి వెళ్లే క్రమంలో ఆ దర్మార్గుడు చాక్లెట్ ఇస్తానని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె బట్టలు తీసేశాడు. తన బట్టలు కూడా తొలగించుకున్నాడు. అయిఏ బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
Also Read: ఈ నెల 10న జగన్ తో చిరంజీవి భేటీ !
అప్పటికే ఆ ముసలి వాడు కూడా వివస్త్రగా మారడంతో స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. దీంతో నిందితుడు కనకయ్యను పోలీసులు అరెస్టు చేశారు.పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.చిన్నారులపై దాడులకు తెగబడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి.
తాగిన మైకంలో ఎందరి జీవితాలు బలవుతున్నా ఎందుకు పసిపాపలను సైతం వదలకుండా ప్రవర్తించడంపై ప్రజల్లో ఆగ్రహం వస్తోంది. నిందితుడిని ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలికల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దుర్మార్గులను ప్రాణాలతో ఉండనివ్వద్దని సూచిస్తున్నారు.
Also Read: లవ్ జిహాదీలకు పదేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల