spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: విశాఖ స్టీల్ లో రాజధాని.. జగన్ పెద్ద స్కెచ్చే వేశాడే?

Jagan: విశాఖ స్టీల్ లో రాజధాని.. జగన్ పెద్ద స్కెచ్చే వేశాడే?

Jagan: వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని గుర్తించింది కూడా ఆయనే. అప్పటివరకు ఉన్న అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. కానీ ముందడుగు వేయలేకపోయారు. అయితే అందరూ అనుకున్నట్టు విశాఖ పాలన రాజధాని వెనుక.. ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్లు రాజాగా వెలుగులోకి వచ్చింది. అమరావతిలో 33 వేల ఎకరాల భూమి, ఎప్పటికీ జరిగిన నిర్మాణాలను కాదని.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది కనుక.. అక్కడే రాజధాని నిర్మాణం ఇట్టే జరిగిపోతుందని అంతా భావించారు. కానీ జగన్ వేరే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం బయటపెట్టారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుందాం అని.. అవసరమైతే సొంత గనులు కేటాయిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం ప్రైవేటీకరణ విషయం బయట పెట్టేసరికి మాత్రం జగన్ మారు మాట అనలేదు. అయితే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అవుతుందో.. లేకుంటే ఎత్తివేస్తారో అనుకున్నారో తెలియదు కానీ జగన్.. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తామని ఆలోచన చేశారట. అయితే అప్పట్లో అదిసాధ్యం కాదని.. మంచి పద్ధతి కాదని చెప్పినా వినలేదని ఎల్వి సుబ్రహ్మణ్యం వాపోయారు. పైగా నీకేంటి తెలుసు అని ఎద్దేవా చేసినట్లు తాజాగా వెల్లడించారు ఆయన. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును మూసేద్దామని అనడమే ఒక వింత. ఆ భూముల్లో రాజధాని పెడతామనడం మరో వింత. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమాజీ ప్రధాన కార్యదర్శి బయట పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రానికి రాజధాని లేదు. పోనీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అభివృద్ధి చేశారంటే అది లేదు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందంటే దానికి ప్రధాన కారకుడు జగన్ అన్న విమర్శ వినిపిస్తోంది. రాజధాని విషయంలో వైసిపి పై ఒక విధమైన అపవాదు ఏర్పడింది. సరిగ్గా ఇటువంటి సమయంలో పెడతానన్న జగన్ ఆలోచన బయటపడింది. ప్రస్తుతం ఎల్ వి సుబ్రహ్మణ్యం ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్ర వెనుక జగన్ ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే దీనిపై జగన్ నేరుగా మాట్లాడతారా? వైసీపీ నేతలు కలుగజేసుకొని నివృత్తి చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper