spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ashok Gajapathi Raju: టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు?

Ashok Gajapathi Raju: టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు?

Ashok Gajapathi Raju: ఏపీలో టీటీడీ చైర్మన్ పదవి మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఓ సీనియర్ నేతకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. తెలుగుదేశంలో కూడా బలమైన చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. ఆయనను టీటీడీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన పదవిపై ఆసక్తి చూపలేదని టాక్ నడిచింది. ఈసారి టిడిపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. స్పీకర్ ఎంపిక పూర్తి చేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నూతన నియామకాలతో పాటు పాలనపై దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పోస్టుల విషయంలో సైతం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. కష్టపడిన వారికి పదవులు ఇస్తామని.. ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే టీటీడీ అధ్యక్ష పదవివిషయంలో ఒక క్లారిటీ వచ్చిందని.. సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు ఆ పదవి ఖాయమైందని సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం జరుగుతోంది.

అశోక్ గజపతిరాజు టిడిపిలో సీనియర్.పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పక్క చూపులు చూడలేదు. ఇప్పటివరకు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కింది. ఒకసారి ఎంపీ అయిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 యండి ఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకొని తన కుమార్తె అదితి గజపతిరాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుపొందింది.

2024 ఎన్నికల తర్వాత అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండడంతో.. తెలుగుదేశం పార్టీకి బిజెపి రెండు గవర్నర్ పోస్టులు ఆఫర్ చేసిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ అటు తర్వాత ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు. విజయనగరం సంస్థానానికి వారసుడిగా, సింహాచలంతో పాటు రామతీర్థ ఆలయ ట్రస్టీగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉంటారని ఆయనకు మంచి పేరు ఉంది. గత ఐదేళ్ల కాలంగా అశోక్ గజపతి రాజును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. అందుకే ఈసారి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి.. ఆయన గౌరవాన్ని పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper