
దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3,95,751 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 1,258 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.