18 ఏళ్లు నిండిన వారికి టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో 4 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్ టీకాలు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రాష్ట్రానికి చేరాయి. వ్యాక్సిన్ డోసులను అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.