ఆంధ్రప్రదేశ్‌AP Aarogyasri Services: ఏపీలో నిలిచిన ఆరోగ్యశ్రీ.. ప్రభుత్వ ఆప్షన్ అదే!

AP Aarogyasri Services: ఏపీలో నిలిచిన ఆరోగ్యశ్రీ.. ప్రభుత్వ ఆప్షన్ అదే!

AP Aarogyasri Services: ఏపీలో( Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేసాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిచిపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేదు. కూటమి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పై ప్రజల్లో ఒక రకమైన సానుకూలత ఏర్పడిన క్రమంలో.. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత మాత్రం ఇబ్బందికర పరిణామంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 2500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సొమ్ము చెల్లిస్తే తప్ప తిరిగి వైద్య సేవలు ప్రారంభించేది లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏకకాలంలో అంత మొత్తం సమకూర్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమే.

* పేరుకుపోయిన బకాయిలు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వంలోనే బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యాయి. కానీ ఒకవైపు చెల్లింపులు చేస్తూ వచ్చిన బకాయిలు మాత్రం పెరుగుతూ వచ్చాయి. దీంతో పలుమార్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెబుతూ వచ్చాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చల ద్వారా సేవల నిలిపివేత లేకుండా చేశాయి. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో.. 2500 కోట్ల రూపాయలు పేరుకుపోవడంతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ప్రధాన సంక్షేమ పథకాలన్నీ ప్రారంభం అయ్యాయి. వారికి భారీ మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఈ సమయంలో రూ.2500 కోట్లు చెల్లించాలంటే ప్రభుత్వానికి కత్తి మీద సామే.

* బీమా పథకం కిందకు..
అయితే కూటమి ప్రభుత్వం( Alliance government ) ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ తో పాటు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేస్తూ.. ఒక బీమా పథకాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వైద్య సేవలను వర్తింపజేస్తూ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేవలం బీమా మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా ప్రభుత్వం పై ఆర్థిక భారం తగ్గుతుంది. ఎవరికైనా వైద్య చికిత్సకు నగదు చెల్లించాలనుకుంటే సదరు బీమా కంపెనీ క్లైమ్ కింద అందిస్తుంది. పైగా గంటల వ్యవధిలోనే వైద్య చికిత్సలకు అనుమతి రానుంది. అయితే క్యాబినెట్లో మాత్రమే ఈ కొత్త ఇన్సూరెన్స్ పథకంపై ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో దీనిని అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. అయితే అంతకంటే ముందే ఆరోగ్యశ్రీ కి కొంత మొత్తం బకాయిలు చెల్లించి.. వైద్య సేవలు పునరుద్ధరించాలని చూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Oktelugu Epaper