Homeఆంధ్రప్రదేశ్‌చంద్రబాబును ముసలి నక్క అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

చంద్రబాబును ముసలి నక్క అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

Kodali Nani sensational comments on chandrababu and lokesh
లాక్ డౌన్, కరోనా సమయంలో కూడా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఏ ఘటన చోటు చేసుకున్నా టీడీపీ దానిని పెద్దది చేయాలనే ప్రయత్నం చేయడం వైసీపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టడం జరుగుతోంది. తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?

చంద్రబాబును ముసలినక్క, నిష్టదరిద్రుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జగన్ ను చూసి కుళ్లుకుంటున్నారని పేర్కొన్నారు. చాలామంది తనను చంద్రబాబు ఎందుకు నిత్యం తిడుతూ ఉంటారని ప్రశ్నిస్తున్నారని.. గౌరవం పొందే స్థాయిలో చంద్రబాబు లేకపోవడం వల్లే తాను ఈ విధంగా చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబును రోడ్లపై అమ్మనా బూతులు తిడుతున్నారని ఆయన అన్నారు.

తిరుమల డిక్లరేషన్స్ విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలే దేవాలయాల ఘటనల విషయంలో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని… పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారని… వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తరువాత దోషులు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని కొడాలి నాని పేర్కొన్నారు.

కోటి రూపాయల రథం పోయినంత మాత్రాన.. 10 కేజీల వెండిబొమ్మలు పోయినంత మాత్రాన రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లదని… హిందువులకు ఛాంపియన్ అని చెప్పుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖ్యల గురించి టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular