ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆ పార్టీ అసలు రాష్ట్రంలో ఇంకా ఉందా అనే పరిస్థితులే కనిపించాయి. ఏదో అడపాదడపా లీడర్లతో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్లుగా పార్టీని నడిపిస్తున్నారు. ఇక తాజాగా.. టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. ఇక దీంతో పార్టీ ఉన్న జవసత్వాలను సైతం కోల్పోయింది. అయితే.. ఈ విలీనం వెనుక మరో కుట్ర దాగి ఉందనే భిన్నాభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది వైఎస్ షర్మిల. నేడు ఖమ్మం వేదికగా పార్టీని సైతం ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీకి హైప్ కల్పించేందుకే కేసీఆర్ కొత్తగా టార్గెట్ పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెట్టడం వల్ల వివిధ కోణాల్లో టీఆర్ఎస్కే అనుకూలం అన్న చర్చ జరుగుతోంది. అందుకే.. ఆంధ్రోడు వచ్చి మామూలు పర్యటన చేస్తే సహించలేని టీఆర్ఎస్ నేతలు.. రాజకీయ పార్టీ పెడుతున్నా పెద్దగా వ్యతిరేకించడం లేదు. పైగా సభలు, సమావేశాలు.. ఇతర రాజకీయ అంశాలపై సపోర్ట్ లభిస్తోంది.
ఈ క్రమంలో టీడీపీ విలీనం అనేది కేసీఆర్ వ్యూహాత్మకంగా పూర్తి చేశారని.. షర్మిల పార్టీ పెడుతున్న సమయంలో మరో ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేయడానికి మరో పార్టీ లేకుండా చేయాలన్న వ్యూహం అమలు చేశారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. షర్మిల పార్టీ ప్రకటించే సరిగా రెండు రోజుల ముందు టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. అయితే.. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఖమ్మం నుంచే ఉన్నారు. తెలంగాణలో పూర్తిగా బలహీన పడిన టీడీపీ ఇంతో అంతో ఖమ్మంలోనే చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. ఇప్పుడక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబి తీర్థం పుచ్చుకోవడంతో అది కాస్తా ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో టీఆర్ఎస్ వైపు రాలేని టీడీపీ అభిమానులు.. ఇక షర్మిల పార్టీ వైపు వెళ్తారని.. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయన్న అంచనాలో ఉన్నారు. సాగర్లోనూ టీడీపీ అభిమానుల ఓట్లు తమకే పడతాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీ మాత్రమే కాదు.. వచ్చే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఉపయోగ పడుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావు .. టీఆర్ఎస్లో చేరడానికి చాలా కాలంగా నిరాకరిస్తున్నారు. కానీ.. ఆయన నియోజకవర్గానికి ప్రభుత్వం ఒక్క పని కూడా చేయడం లేదు. చివరికి తెలంగాణలో టీడీపీ లేదు అనిపించేలా చేయడానికి సండ్ర సాయంతో ఒప్పించారు. కేసీఆర్ అనుకున్న లక్ష్యం చివరగా నెరవేరింది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Is there such a conspiracy behind tdp merger
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com