spot_img
Homeఆంధ్రప్రదేశ్‌పోలవరంపై కేంద్రం మెలిక..జగన్ ఆశలు అడియాశలు..

పోలవరంపై కేంద్రం మెలిక..జగన్ ఆశలు అడియాశలు..

Jagan-Modi

ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులు ప్రారంభించింది అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని, ఐదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్త చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని వైసీపీ ప్రచారం చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి పోలవరం పనులు కొనసాగించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. వ్యూహం ఫలించిందా?

2019 ఎన్నికల తరువాత మోడీకి మద్దతుగా ఉంటూ వస్తున్న జగన్ పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.20398.61 కోట్లు. కానీ కొన్ని కారణాల వల్ల అంచనా విలువ పెరిగిపోయింది. దీంతో కేంద్రం విడుదల చేయాల్సిన నిధులపై ఏపీకి మోడీ ప్రభుత్వం మెలికలు పెడుతోంది. భూసేకరణ, పునరావాసం విషయంలో కేంద్రానికి సంబంధం లేదని, ఆ విషయంలో ఖర్చును రాష్ట్రప్రభుత్వాలే భరించాలని తెలుపుతోంది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..?

ఇందుకు జగన్ అంగీకరించడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 2,234.288 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిధులను నేరుగా జగన్ ప్రభుత్వానికి కాకుండా పీడీ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందులో నిధులు వేస్తామని ప్రాజెక్టుకు వాడుకోవచ్చని తెలిపింది. పీడీ అకౌంట్ ద్వారా వచ్చే నిధులు కేవలం ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. ఇతర అవరసరాలకు ఉపయోగించరాదు. దీంతో జగన్ ఆశలు అడియాశలయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న జగన్ ఖజానాలో నిధులు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం పోలవరం నిధులు విడుదల చేస్తే సంక్షేమ పథకాలకు వినియోగించుకొని వచ్చే ఎన్నకల కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అయితే కేంద్రం పీడీ అకౌంట్ రూపంలో షాక్ ఇవ్వడంతో జగన్ అయోమయంలో పడ్డారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కాగా సోమవారం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు హై లెవల్ ఫేజ్-2 పనులను ప్రారంభించారు. నీటి విలువ తెలుసిన ప్రభుత్వం మాది.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చారు. 2022వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. దీంతో జగన్ కేంద్రం నిధులతో పోలవరం ప్రాజెక్టు ను ఏవిధంగా పూర్తి చేస్తాడో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
Oktelugu Epaper