Homeఆంధ్రప్రదేశ్‌శ్రీరాముడి చుట్టే ఏపీ రాజకీయాలు..: రామతీర్థానికి చంద్రబాబు

శ్రీరాముడి చుట్టే ఏపీ రాజకీయాలు..: రామతీర్థానికి చంద్రబాబు

AP politics
ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు రామతీర్థం శ్రీరాముడి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం కావడం పెద్ద దుమారం అయింది. దీనిపై అటు రాజకీయ నేతలే కాకుండా.. ఇటు అధ్యాత్మిక వేత్తలూ స్పందిస్తున్నారు. అసలు విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా విజయనగరం టూర్‌‌ పెట్టుకున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై చినజీయర్‌‌ ఫైర్‌‌

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా పోలీసులు పట్టుకోవడం లేదనే నిర్ణయానికి వచ్చారు. రామతీర్థంలో ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయానికి వచ్చారు. ఏపీలో ఆలయాలపై దాడులు నిత్యకృత్యం దురదృష్టకరమని.. ప్రభుత్వ అలసత్వం వల్లే ఇలా జరగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేదు.. అంతర్వేదిలో రథం తగులబెట్టిన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.

చంద్రబాబు రామతీర్థం ఆలయాన్ని పరిశీలించబోతున్నారని తెలియగానే విశాఖలోనే ఉన్న విజయసాయిరెడ్డి వెంటనే ఆరోపణలు ప్రారంభించారు. రామతీర్థంలో శ్రీరాముల వారి ఆలయ ధ్వంసం.. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నిందితులెవరో విచారణలో తేలుతుందని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏ-2 రెడ్డితో ఆరోపణలు చేయించడం ఎందుకని నేరుగా.. సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రమాణం చేద్దాం రమ్మని ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ చేశారు. ఫేక్ పార్టీ..ఫేక్ సీఎం.. ఫేక్ ఆరోపణలు.. పేక్ పాలన అని విరుచుకుపడ్డారు. పింక్ డైమండ్ పేరుతో చేయించిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు.

Also Read: ఆదిలాబాద్ ‘అడవుల్లో’ పురుడుపోసుకున్న కొత్త ఉద్యమం..!

ఇప్పటికే ఏపీలో 160కి పైగా ఆలయాలపై దాడులు జరగడంతో తాజాగా.. రాజమండ్రితోపాటు మరికొన్ని చోట్ల ఆలయాలపై దాడులు జరిగాయి. కానీ.. ఎక్కడా ప్రభుత్వం నిందితులను పట్టుకోలేదు. ఓ ప్రణాళిక ప్రకారం.. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నా పోలీసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. తాము ఏం చేస్తున్నామనో తెలుసుకోకుండా.. ప్రతిపక్షంపై అధికార పక్షం ఆరోపణలకు దిగడం పరిపాటైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular