Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చింది, అభిమానులు ఈ సినిమా నుండి ఏదైనా భారీ అప్డేట్ వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ చివరికి షూటింగ్ మేకింగ్ ఫోటోలు కొన్ని వదిలారు. దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . కనీసం మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ అని అయినా విడుదల చేస్తారని ఆశించారు , అది కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ఒక ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రం లో ‘రామాయణం’ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీక్వెన్స్ దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సీక్వెన్స్ లో శ్రీరాముడు , లక్ష్మణుడు , కుంభకర్ణుడు , హనుమంతుడు ఉంటారు. శ్రీరాముడి క్యారెక్టర్ మహేష్ బాబు చేస్తున్నాడు అనేది పాత విషయమే , కానీ హనుమంతుడి క్యారెక్టర్ కోసం రాజమౌళి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు , రామ్ చరణ్ కి హనుమాన్ లుక్ తో ఫోటో షూట్ జరిపి , ఆయనపై 5 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారట. ఈ విషయాన్ని రాజమౌళి చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇదే కనుక నిజమైతే , ‘వారణాసి’ రేంజ్ ఇంకా పెద్దది అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రామ్ చరణ్ , మహేష్ బాబు వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని , కోట్లాది మంది భక్తులు కొలిచే దేవుళ్ళ పాత్రల్లో కనిపిస్తే వెండితెర పై చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం కి పైగా పూర్తి అయ్యింది. వచ్చే నెల చివరి లోపు కానీ , అక్టోబర్ నెలాఖరు లోపు కానీ ఈ సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. ముందు చెప్పినట్టుగానే ఏప్రిల్ 7,2027 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు టాక్.