Homeఎంటర్టైన్మెంట్Rajamouli in Death Stranding 2 : సెట్స్ పై SSMB 29, మధ్యలో రాజమౌళి...

Rajamouli in Death Stranding 2 : సెట్స్ పై SSMB 29, మధ్యలో రాజమౌళి చేసిన పనికి అందరూ షాక్! వీడియో వైరల్

Rajamouli in Death Stranding 2 : రాజమౌళి గ్లోబల్ ఐకాన్ అనే విషయం మరోసారి రుజువైంది. ఒకపక్క SSMB 29 షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఫ్యాన్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. వరల్డ్ ఫేమస్ వీడియో గేమ్ లో కనిపించి, మెస్మరైజ్ చేశాడు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..

దేశంలోనే ఏస్ డైరెక్టర్ గా ఉన్నారు రాజమౌళి. ఆయన నటుడు కూడాను. తన సినిమాల్లోని ప్రతి సన్నివేశాన్ని ఆయన నటించి చూపిస్తారు. అలా నటించి చూపించడం ద్వారా తమ పని తేలిక అవుతుందని పలువురు నటులు గతంలో తెలియజేశారు. రాజమౌళి పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. బాహుబలి, కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్స్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఆయనకు ఉన్న ఇమేజ్ రీత్యా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించారు. తాజాగా మరో అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. రాజమౌళి(RAJAMOULI) గ్లోబల్ ఐకాన్ అనే విషయం ఈ పరిణామం రుజువు చేసింది.

వివరాల్లోకి వెళితే వరల్డ్ ఫేమస్ వీడియో గేమ్ డెత్ స్ట్రాండింగ్ 2 ఆన్ ది బీచ్(Death Stranding2 OnTheBeach) లో రాజమౌళి కనిపించనున్నారు. వీడియో గేమ్ లవర్స్ కి డెత్ స్ట్రాండింగ్ చాలా ఫేవరేట్. ఈ వీడియో గేమ్ కి వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకుంది. ఫేమస్ వీడియో గేమ్స్ మేకర్స్ హిడియో కోజిమా దీన్ని రూపొందించారు. సీజన్ వన్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 2 త్వరలో అందుబాటులోకి తేనున్నారు. డెత్ స్ట్రాండింగ్ 2 లో రాజమౌళి, కార్తికేయ భాగమయ్యారు. రాజమౌళికి దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని భావించవచ్చు.

జపాన్ లో రాజమౌళి చిత్రాలకు భారీ మార్కెట్ ఉంది. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. డెత్ స్ట్రాండింగ్ వీడియో గేమ్ మేకర్ హిడియో కోజిమా ను రాజమౌళి 2022లో కలిశారు. అనూహ్యంగా కోజియో ఫేమస్ వీడియో గేమ్ లో రాజమౌళి కనిపించి షాక్ ఇచ్చారు. రాజమౌళితో కూడిన డెత్ స్ట్రాండింగ్ 2 వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి ఎంట్రీతో డెత్ స్ట్రాండింగ్ 2కి ఇండియాలో విశేష ప్రాచుర్యం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

మరోవైపు రాజమౌళి SSMB 29 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు(MAHESH BABU)-రాజమౌళి కాంబోలో వస్తున్న ఫస్ట్ చిత్రం SSMB 29. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో జరగనుందని సమాచారం. ఏ షెడ్యూల్ నందు ప్రియాంక చోప్రా సైతం జాయిన్ అవుతారట. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular