‘సరిలేరు నీకెవ్వరూ’తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం వేగం పెంచాడు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశరాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ కోసం రెడీ అవుతున్నాడు. టైటిల్తో పాటు ఈ మూవీలో మహేష్ పస్ట్లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెడపై రూపాయి టాటూ, చెవి పోగుతో ఉన్న మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీలో హీరోయిన్గా చిత్ర బృందం అన్వేషిస్తోంది. దీనిపై రోజుకో వార్త వస్తోంది. తొలుత కియారా అద్వానీ, పూజా హెగ్డేతో పాటు కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. కానీ, సూపర్ స్టార్ సరసన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని బాలీవుడ్ యువ నటి, దబాంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ను సంప్రదించారని తెలిసింది. ఈమె ప్రముఖ మరాఠీ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తనయ.
తాను మహేష్ మూవీకి సంతకం చేయలేదని సయీ చెప్పింది. ఈ మూవీకి తాను హీరోయిన్గా ఎంపికయ్యానన్న వార్తల్లో నిజం లేదంది. కానీ, ఫ్యూచర్లో ఏమైనా జరుగొచ్చు అని ట్విస్ట్ ఇచ్చింది. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన పేరెంట్స్కు సన్నిహితురాలు అని చెప్పింది. గతంలో ‘భరత్ అనే నేను’లో కోసం కియారాను ఫైనల్ చేయడంలో నమ్రతనే కీలక పాత్ర పోషించిందట. ఈ నేపథ్యంలో సయీని కూడా ఒప్పించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. కాగా, మహేష్ మూవీపై క్లారిటీ ఇవ్వలేకపోయినా తాను ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్టు సయీ స్పష్టం చేసింది. ఆ సినిమా పేరు మాత్రం వెల్లడించలేదు. కానీ, వరుణ్ తేజ్ తర్వాతి చిత్రం ‘బాక్సర్’లో సయీనే హీరోయిన్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు మూవీలో చేస్తున్నా అని సయీ చెప్పిన నేపథ్యంలో వరుణ్తో ఆమె ‘ఆట’ ఖాయమైందని అర్థమవుతోంది. ఇక, మహేష్తో ‘పాట’ గురించే క్లారిటీ రావాల్సి ఉంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Saiee manjrekar to debut in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com