Mahesh – Prabhas : ఆదివారం రాత్రి హైదరాబాద్ వేదికగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మహేష్ బాబుకు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఎదుట పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఏప్రిల్ 28 రాత్రి హైదరాబాద్ లో మహేష్ బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మహేష్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. మహేష్ తో పాటు భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇదే వేడుకకు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి సైతం వచ్చారు.
వేడుకలో మహేష్-శ్యామల దేవి ఎదురు పడ్డారు. శ్యామల దేవి-మహేష్ బాబు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నమ్రత, సితారను శ్యామల దేవి ప్రేమగా హత్తుకున్నారు. వారి మధ్య అభిమానంతో కూడా చక్కని సంభాషణ చోటు చేసుకుంది. ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే మహేష్-ప్రభాస్ చాలా అన్యోన్యంగా ఉంటారు. వారి మధ్య అన్నదమ్ముల బాండింగ్ ఉంది. మనమే సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉంటాము.. అని ప్రభాస్ ఫ్యాన్ రాసుకొచ్చాడు.
టాలీవుడ్ బడా స్టార్స్ అయిన ప్రభాస్-మహేష్ మధ్య తరచుగా ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయి. ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య ఏపీ సీఎం ని టికెట్స్ ధరల విషయమై చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు కలిశారు. వారిలో ప్రభాస్, మహేష్ కూడా ఉన్నారు. అప్పుడు ప్రభాస్, మహేష్ సంభాషణకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు మ్యూచువల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక మహేష్ బాబు త్వరలో దర్శకుడు రాజమౌళితో సినిమా చేయనున్నాడు. వీరిలో కాంబోలో మొదటిసారి మూవీ వస్తుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబి 29 బడ్జెట్ రూ. 800 కోట్లు అని సమాచారం. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కల్కి జూన్ 27న విడుదల కానుంది.
Mahesh babu meets Prabhas’ peddamma Syamaladevi garu and she poses for a click with him!#MaheshBabu | #Pokiri #SSMB29
My Hero @urstrulymahesh pic.twitter.com/xfFQ9VGlmL— VardhanDHFM (@_VardhanDHFM_) April 28, 2024