NTR On Japan Earthquake: ఎన్టీఆర్ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. విషయంలోకి వెళితే… న్యూ ఇయర్ వేడుకల కోసం కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ లతో కలిసి జపాన్ లో ఆహ్లాదంగా గడిపారు. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. వేడుకలు ముగించించుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. కాగా నిన్న జపాన్ లో భారీ భూకంపం చోటు చేసుకుంది.
సునామీ సైతం తీరప్రాంతాన్ని ముంచెత్తింది. భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. అయితే భూకంపం సంభవించిన ప్రాంతంలోనే ఎన్టీఆర్ కుటుంబం ఉందట. ఆయన ఇండియాకు వచ్చేయడం వలన భారీ ప్రమాదం నుండి బయటపడగలిగారు. ఈ విషయం తెలియజేస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్ భూకంపం దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడే ఒక వారం రోజులు గడిపాము. ఈ భూకంపం ప్రభావం నుండి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను, అని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారని తెలుసుకుని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ కి జపాన్ దేశం అంటే చాలా ఇష్టం. ఆ దేశంలో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో ఆదరణ ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
మరోవైపు ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. షూటింగ్ 80 శాతం వరకు కంప్లీట్ అయినట్లు సమాచారం. న్యూ ఇయర్ సందర్భంగా దేవర ఫస్ట్ గ్లింప్స్ డేట్ ప్రకటించారు. 8వ తేదీన దేవర ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. దేవర పాన్ ఇండియా చిత్రంగా వరల్డ్ వైడ్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా కొరటాల శివ దర్శకుడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.