Homeఎంటర్టైన్మెంట్కరోనా విపత్తుకి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

కరోనా విపత్తుకి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

జనసేన పార్టీ అధినేత మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. జాతికి విపత్తు వచ్చినపుడు ఎపుడూ ముందుండే ఈ మంచి మనిషి కరోనా బాధితులకు అండగా ఉండాలని తనకు తోచిన రీతిలో సాయం చేయ బోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించాడు. తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తక్షణమే వాటిని ప్రభుత్వానికి అందజేసే దిశగా తనవంతు కృషి చేస్తున్నాడు.

జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ భారీ సాయం విషయం తెలుసుకొన్న అభిమానులు, సామాన్య జనం ఆయన్ని అభినందిస్తున్నారు. ఇక జనసైనికులు అయితే మా నాయకుడు చేసిన పనికి గర్వంగా ఉంది అని చెబుతున్నారు. గతంలో కూడా హుద్ హుద్ తూఫాన్ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా ఇలాగే అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ నిలిచాడని గుర్తు చేసుకొన్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరో కోటి రూపాయలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కాగా దేశం లో కోటి రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ప్రధాన మంత్రి జాతి విపత్తు నుంచి మనల్ని బయట పడేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తాను కూడా భాగస్వామి కావాలని తపనతో ఈ కోటి రూపాయల సాయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా వైరస్ ఫై ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈ కోటి రూపాయల సాయం తో మరో అడుగు ముందు వేయడం జరిగింది. ప్రకృతి విపత్తులు జరిగినపుడు సాయం చేయడం పవన్ కళ్యాణ్ కి ఇదేమి కొత్త కాదు ఇప్పటికే చాలా సార్లు ఆర్ధిక సాయం చేసి తన పెద్ద మనసు చాటు కోవడం జరిగింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular