కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చే వారిపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా 14రోజుల క్వారంటైన్ లో ఉండాలని, క్వారంటైన్ పూర్తయిన తరువాత వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామని ఈ నిబంధనకు అంగీకరించేవారు మాత్రమే ఏపీకి రావాలని ఆదేశించింది.
దీంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వారిని నిలిపివేశారు. నిన్న వేలాది మంది విద్యార్థులను జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు.అదేవిధంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు డాక్టర్లను పంపిస్తామని, కరోనా వైరస్ టెస్ట్ ల అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.
క్వారంటైన్ కు అంగీకరించిన వారిని నూజివీడు ట్రిపుల్ ఐటికి పంపించేందుకు ఏపీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీంతో క్వారంటైన్ అంగీకరించిన వారిని బస్సుల్లో తరలిస్తుండగా…క్వారంటైన్ కు ఒప్పుకోని వారు నగరానికి తిరుగు ప్రయాణ మయ్యారు.