spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Volunteers: వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాలంటీర్లు?

YCP Volunteers: వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాలంటీర్లు?

YCP Volunteers: ఏపీలో( Andhra Pradesh) వాలంటీర్ల కథ ముగిసినట్టేనా? కూటమి ప్రభుత్వం వారి నియామకం చేపట్టదా? వారిని అదనపు భారం అని భావిస్తోందా? అందుకే భర్తీ చేయడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. కానీ ఎంతవరకు వాలంటీర్ల నియామకం చేపట్టలేదు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం వాలంటీర్ల ప్రస్తావన చేయడం లేదు. దీంతో వాలంటీర్ల అంశం అనేది ముగిసిన అధ్యయంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు పోరాట బాట పట్టారు వాలంటీర్లు. కానీ తరువాత దానిని కొనసాగించలేకపోయారు. అయితే వాలంటీర్లను మరిచిపోవడం తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం.

* ప్రజల్లో సంతృప్తి పెంచింది వారే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత ప్రభుత్వం వారికి అప్పగించింది. దీంతో ప్రజల్లో కూడా సంతృప్తి శాతం కనిపించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత లేకపోవడంతో వారు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. వైసిపి నాయకత్వం తీరుపై ఆవేదన చెందారు. 2024 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయలేదు. దాంతో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. అయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ స్థాయిలో ఓట్లు రావడానికి ప్రధాన కారణం వాలంటీర్లు. కానీ దానిని గుర్తించలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

* పేద ప్రజలు మద్దతు వెనుక..
పేద ప్రజలు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అయితే సమాజంలో మిగతా వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణంగా వ్యతిరేకించాయి. దానికి ప్రభుత్వ వైఫల్యాలు తోడయ్యాయి. ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు అండగా నిలవడానికి మాత్రం ముఖ్య కారణం వాలంటీర్లే. అంతగా పేద ప్రజలతో మమేకమై పనిచేశారు వాలంటీర్లు. 2019 ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని రకాల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అదే ప్రధాన కారణం. కానీ వాలంటీర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకించడం, ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతోనే వైసీపీకి షాక్ తగిలింది. ఓటింగ్ శాతం ఉన్న పరాజయం ఎదురయింది అందుకే. దానిని గుర్తించలేని స్థితిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* మానస పుత్రిక పై నిర్లక్ష్యం..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వాలంటీర్ వ్యవస్థను తన మానస పుత్రికగా భావించారు. ఆ వ్యవస్థ తనను గట్టెక్కిస్తుందని నమ్మకంగా మాట్లాడారు. అయితే వాలంటీర్లు పనిచేశారు కానీ.. వారిని వ్యతిరేకించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పనిచేయలేదు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు వస్తే తమకు పదివేల రూపాయల వేతనంతో ఉద్యోగం ఖాయమని కొంతమంది వలంటీర్లు భావించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మరి కొంతమంది రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోక పోగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమకోసం ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు సైతం ఆశలు వదులుకున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper