Illu Illalu Pillalu: స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ప్రభాకర్ , సీనియర్ హీరో ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ వస్తుందంటే చాలు , ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ లకు అతుక్కుపోతుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ సీరియల్ కి ప్రభాకర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. టీఆర్ఫీ రేటింగ్స్ ప్రతీ వారం ఈ సీరియల్ కి యావరేజ్ గా 7 నుండి 8 కి మధ్యలో ఉంటుంది. అలాంటి సూపర్ హిట్ సీరియల్ కి త్వరలోనే శుభం కార్డు పడబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇది ఈ సీరియల్ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసే విషయమే.
రీసెంట్ గానే ఈ సీరియల్ కి సంబంధించిన చివరి ఎపిసోడ్ ని కూడా పూర్తి చేశారట మేకర్స్. ఈ నెల 29 వ తేదీన క్లైమాక్స్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయబోతున్నారట. ఇకపై ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ స్థానం లో ‘పొదరిల్లు’ ని టెలికాస్ట్ చేయబోతున్నారట. ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ 2 టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. ఇప్పుడు మరింత మంచి స్లాట్ లోకి ఈ సీరియల్ వెళ్లడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీరియల్ 549 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. స్టార్ మా ఛానల్ లో అతి తక్కువ రోజుల్లో ముగిసిన సీరియల్స్ జాబితా లో ఈ సీరియల్ కూడా చేరిపోయింది. ఇంత అర్థాంతరంగా ఈ సీరియల్ ని ముగించడానికి ముఖ్య కారణం ‘బిగ్ బాస్ 10’ షో.
వచ్చే నెల 6 వ తేదీ నుండి ఈ షో ప్రారంభం కావడం తో , ఒక సీరియల్ కి ముగింపు కార్డు పలకాల్సిన అవసరం వచ్చింది. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కథ కూడా చివరి దశకు చేరుకోవడం తో , ఈ వారం లోనే ముగించాలని స్టార్ మా టీం సీరియల్ నిర్మాత ప్రభాకర్ కి చెప్పడం తో , రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సీరియల్ అయిపోవడం వల్ల , ఒక స్లాట్ ఖాళీ అవ్వడం తో , ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బిగ్ బాస్ 10 ప్రసారం కానుంది.