Thota Trimurthulu
Thota Trimurthulu: ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతకు ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. 28 ఏళ్ల కిందట దళితులను హింసించి.. శిరోముండనం చేసినందుకు కోర్టు కఠిన శిక్ష విధించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. సరిగ్గా నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుందనగా కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో సదరు నేత ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
1996లో త్రిమూర్తులు టిడిపి కీలక నేతగా ఉండేవారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం లో 1996 డిసెంబర్ 29న దళితులపై దాడి జరిగింది. ఐదుగురు దళితులను దారుణంగా హింసించారు. ఇద్దరికి శిరోముండనం కూడా చేశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. గత 28 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. 148 సార్లు కేసు వాయిదా పడింది. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.
అయితే ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును విశాఖపట్నం కోర్టు మంగళవారం ప్రకటించింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. టిడిపిలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో కోర్టు 18 నెలల పాటు శిక్ష విధించడంతో సంచలనం గా మారింది. ఈ కేసు విషయంలో పై కోర్టులో త్రిమూర్తులు సవాల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చట్టపరంగా ఇబ్బందులు ఎదురైతే.. ఆయన కుటుంబంలో మరో వ్యక్తి మండపేట నుంచి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తోట త్రిమూర్తులు అయితేనే గట్టి అభ్యర్థి అవుతారు. ఈ నేపథ్యంలో ఆయనకు జైలు శిక్ష విధించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Venkatayapalem shiromundanam case verdict
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com