Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: కూటమికి పాజిటివ్ వేవ్ కృత్రిమమా? వాస్తవమా?

AP Elections 2024: కూటమికి పాజిటివ్ వేవ్ కృత్రిమమా? వాస్తవమా?

AP Elections 2024: గత ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. తారాస్థాయికి చేరుకోవడంతో వైసీపీకి ఘన విజయం లభించింది. ఎన్నికలకు ముందే వైసీపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు నాటి టిడిపి ప్రభుత్వం మాదిరిగానే.. వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న గ్రామీణుల్లో కొంతవరకు పాజిటివ్ కనిపిస్తోంది. కానీ మిగతా వర్గాల్లో మాత్రం ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అటు ఎన్నికల ప్రచారంలో సైతం కూటమి ముందు వరుసలో ఉంది. మెజారిటీ సర్వేలు సైతం ఎన్డీఏకు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి.

అయితే కూటమికి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఎన్నికల వ్యూహకర్తల ప్రయత్నిస్తున్నారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. అటు ఎల్లో మీడియా సైతం అదే భావన కల్పిస్తోందన్నది వారి వాదన. అయితే అంతకంటే ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయడం, తామంతా కూటమికే వేసామని వారు బాహాటంగా చెబుతుండడం.. కూటమి పట్ల పాజిటివ్టి పెరగడానికి ఒక కారణం. గత ఎన్నికల్లో జగన్ సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకపక్షంగా వేశారు. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉద్యోగ ఉపాధ్యాయులు పోలరైజ్ అయ్యారని.. కూటమి వైపు మొగ్గు చూపడంతో.. ఒక వేవ్ వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావం తప్పకుండా పోలింగ్ పై పడుతుందని చెబుతున్నారు. గతంలో ఉద్యోగులు ఓటు వేయడాన్ని చాలా లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పట్టు పట్టి క్యూ లైన్ లో నిలబడి మరి ఓటు వేయడాన్ని ఉదహరిస్తున్నారు. ఇది కచ్చితంగా జగన్ సర్కార్ పై కసితో చేసిన పని అని గుర్తు చేస్తున్నారు.

బిజెపి అగ్ర నాయకత్వం నుంచి కూటమికి సంపూర్ణ సహకారం లభిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి మూడు విడత ఎన్నికలు జరిగాయి. దీంతో అక్కడ బిజెపి నాయకత్వం దృష్టిసారించింది. కూటమిలో భాగంగా ఏపీలో పోటీ చేస్తున్నా.. పెద్దగా స్పందించటం లేదని వైసిపి ప్రచారం చేసింది. మరోవైపు కీలక అధికారుల బదిలీ విషయంలో సైతం టిడిపికి సహకారం అందడం లేదని టాక్ నడిచింది. అయితే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి అగ్ర నేతలు ఏపీకి క్యూ కడుతున్నారు. వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వివాదాస్పద అధికారులపై బదిలీ వేటు పడుతోంది. దీంతో ఈ పరిణామాలన్నీ కూటమికి పాజిటివ్ రావడానికి కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు సర్వేలు సైతం అనుకూలంగా వస్తుండడంతో అధికార వైసిపి కలవరపాటుకు గురవుతోంది. కూటమికి పాజిటివ్ వేవ్ రాజకీయ వ్యూహకర్తల పనేనని.. అందులో ఎంత మాత్రం నిజం లేదని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. మొత్తానికి అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీ మాదిరిగానే.. ఇప్పుడు టిడిపి కూటమికి పరిస్థితులు కలిసి వస్తున్నాయి. అయితే అవి ఎన్నికల ఫలితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular