Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party : జనసేనలోకి ఒకప్పటి టిడిపి నేత.. ఆ మాజీ మంత్రి మంత్రాంగం!

Janasena Party : జనసేనలోకి ఒకప్పటి టిడిపి నేత.. ఆ మాజీ మంత్రి మంత్రాంగం!

Janasena Party  : ఏపీలో ( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఆ పార్టీ ఓడిపోయిన నాటి నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజీనామా చేసి రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన బాటలోనే తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేశారు. తాజాగా ఒంగోలు జిల్లాకు చెందిన 20 మంది కార్పొరేటర్లు గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పుడు అదే ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

* ప్రకాశం జిల్లాలో బలమైన నేత
ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivasa Reddy ) గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనను రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి చేపట్టారు బాలినేని. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసిన తర్వాత కూడా మంత్రి పదవి చేపట్టారు. అయితే ఈ ఎన్నికల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేన ను బలోపేతం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసిన బలమైన నేతలను జనసేనలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : బాలినేని కోసం పట్టుపడుతున్న పవన్.. డైలమాలో చంద్రబాబు

* జనసేనలో చేరిక ఖాయం
మాజీ మంత్రి సిద్దా రాఘవరావు( Siddha Raghav Rao  ) జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు రాఘవరావు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేతగా కూడా గుర్తింపు పొందారు. 2014లో దర్శి టిడిపి టికెట్ దక్కించుకున్నారు రాఘవరావు. ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయనకు సామాజిక సమీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో దర్శి టికెట్ బదులు ఒంగోలు పార్లమెంట్ సీటు కేటాయించారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో దర్శి టిక్కెట్లు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇచ్చారు. అప్పటినుంచి మనస్థాపంతో ఉన్నారు. తాజాగా జనసేనలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా..
తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) మంచి అనుబంధమున్న సిద్దా రాఘవరావు.. తొలుత ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు సార్లు చంద్రబాబును కూడా కలిశారు. తన మనసులో ఉన్న మాటను చెప్పారు. అయితే చంద్రబాబు నుంచి అంతగా సానుకూలత రాలేదు. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని.. జనసేనలో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో సిద్దా రాఘవరావు చేరికపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: వైసీపీకి షాక్.. నిన్న తుని..నేడు ఒంగోలు.. బాలినేని భారీ స్కెచ్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular