spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly: కండువా లేకుండా ఆ ఎమ్మెల్యే.. గట్టిగానే నిలదీసిన జగన్!

AP Assembly: కండువా లేకుండా ఆ ఎమ్మెల్యే.. గట్టిగానే నిలదీసిన జగన్!

AP Assembly: ఈరోజు ఏపీ శాసనసభలో( AP assembly) ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. కొందరు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ పదవులను వదులుకున్నారు. కూటమి పార్టీలో చేరారు. ఇటువంటి తరుణంలో ధైర్యం పోగుచేసుకొని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.

* ప్రతిదీ ఆసక్తికరమే
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)గత సమావేశాలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో తమ వాయిస్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరుగుతుండడంతో జగన్ శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా ప్రచారం జరిగింది. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత దక్కింది.

* ఆ ఒక్క ఎమ్మెల్యే తప్ప
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సభ్యులంతా పార్టీ కండువాలతో సభలోకి వచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కండువాలు వేసుకుని కనిపించారు. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం కండువా లేకుండా కనిపించడం అక్కడ హాట్ టాపిక్ అయింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పార్టీ పార్టీ రాజశేఖర్ పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో అందరూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు. ఈ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు జగన్. కూటమి ప్రభంజనంలో సైతం రాజశేఖర్ గెలిచారు.

* జగన్ అసహనం
అయితే రాజశేఖర్( MLA Rajasekhar ) కండువా వేసి రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గమనించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశాలను బహిష్కరించిన అనంతరం పార్టీ రాజశేఖర్ను పిలిచి మందలించినట్లు ప్రచారం నడుస్తోంది. కండువా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను మరిచిపోయానని ఆయన బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిచిపోయారా? కండువా మార్చేస్తారా? అని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేసరికి రాజశేఖర్ నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper