Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: చంద్రబాబు మాటంటే మాటే.. వారిద్దరికీ అనూహ్య పదవులు!

CM Chandrababu: చంద్రబాబు మాటంటే మాటే.. వారిద్దరికీ అనూహ్య పదవులు!

CM Chandrababu: వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) బలోపేతానికి కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వారికి టిక్కెట్ దక్కలేదు. వివిధ సమీకరణలో భాగంగా చంద్రబాబు వారికి అవకాశం ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సరైన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వారికి పదవులు కట్టబెట్టారు. నామినేటెడ్ పదవులు ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీలకు 29 అసెంబ్లీ సీట్లను విడిచిపెట్టింది. మరోవైపు టిడిపిలో కొత్తవారికి సైతం అవకాశం ఇచ్చారు. ఈ లెక్కన పదుల సంఖ్యలో నేతలు టిక్కెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అటువంటి వారికి ఇప్పుడు తాజాగా నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి. అందులో భాగంగానే మాజీ మంత్రి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలకు కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు.

* జవహర్ కు క్యాబినెట్ తో సమానంగా..
2014లో కొవ్వూరు( kovvuru ) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కేఎస్ జవహర్. చంద్రబాబు ఆయనను నిలిచి మరి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవి కేటాయించారు. చంద్రబాబు పట్ల విధేయత చూపుతూ ముందుకు సాగారు జవహర్. దీంతో 2019 ఎన్నికల్లో రెండోసారి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. అయితే నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వెళ్లారు కానీ.. కె ఎస్ జవహర్ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండిపోయారు. పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపించారు. అయితే 2024 ఎన్నికల్లో మారిన సమీకరణల నేపథ్యంలో కొవ్వూరు టికెట్ జవహర్ కు ఇవ్వలేకపోయారు. సముదాయించి ఒప్పించే ప్రయత్నం చేశారు. జవహర్ సైతం అధినేత చంద్రబాబు పట్ల విధేయత చూపారు. ఆయన ఆదేశాలను పాటించారు. ఫలితంగా ఇప్పుడు క్యాబినెట్ హోదాతో సమానమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు.

* సుగుణమ్మకు వరించిన పదవి..
మరోవైపు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు( sugunama ) సైతం అనుకోని పదవి ఇచ్చారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు సుగుణమ్మ. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆమెపై వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయినా సరే గత ఐదేళ్లలో తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో సుగుణమ్మ టిక్కెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం ఆమె కృషి చేశారు. అయితే ఇప్పుడు ఆమె అడగకుండానే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.

* వారికి ఎమ్మెల్సీ పదవులు..
అయితే పదవులు దక్కని త్యాగశీలులు చాలామంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ) లాంటి నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరు గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ టిక్కెట్లు దక్కలేదు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ దాదాపు పూర్తయింది. అందుకే వీరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతవరకు వెయిట్ చేయక తప్పదని ఇప్పటికే వీరికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular