HomeతెలంగాణLPG Gas KYC: ఆగస్టు 31లోపు డెడ్ లైన్.. ఈ కేవైసీ కోసం ఇంట్లోనే ఇలా...

LPG Gas KYC: ఆగస్టు 31లోపు డెడ్ లైన్.. ఈ కేవైసీ కోసం ఇంట్లోనే ఇలా చేయండి..

LPG Gas KYC: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 31లోగా ఈ కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ గడువులోగా పూర్తి చేయని వినియోగదారులకు భవిష్యత్తులో గ్యాస్ సేవలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సబ్సిడీ, వినియోగదారుల వివరాల ధృవీకరణ, డూప్లికేట్ కనెక్షన్ల నివారణ వంటి అంశాల కోసం ఈ ప్రక్రియను చేపడుతున్నారు. అయితే ఈ కేవైసీ కోసం […]

LPG Gas KYC: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 31లోగా ఈ కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ గడువులోగా పూర్తి చేయని వినియోగదారులకు భవిష్యత్తులో గ్యాస్ సేవలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సబ్సిడీ, వినియోగదారుల వివరాల ధృవీకరణ, డూప్లికేట్ కనెక్షన్ల నివారణ వంటి అంశాల కోసం ఈ ప్రక్రియను చేపడుతున్నారు. అయితే ఈ కేవైసీ కోసం ప్రత్యేకంగా కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. అదెలాగో చూద్దాం..

గ్యాస్ కనెక్షన్లు నిజమైన లబ్ధిదారుల పేర్లలోనే కొనసాగుతున్నాయా..? లేదా అనే విషయాన్ని నిర్ధారించడం కోసమే ఈ ఈ కేవైసీ. ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండటం.. తప్పుడు వివరాలతో కనెక్షన్లు తీసుకోవడం వంటి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ధ్రువీకరణను చేపడుతున్నాయి. దీంతో అర్హులైన వినియోగదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కేవైసీ పూర్తి చేయడానికి గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలంటే కొందరికి ఇబ్బందులు ఉంటాయి. దీంతో ఆ అవసరం లేకుండా ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా దీనిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మీరు ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ ఉపయోగిస్తున్నారో దానికి అనుగుణంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఆ కంపెనీ వెబ్ సైట్ నుంచి కూడా ఈ ప్రక్రియను చేయొచ్చు.

ముందుగా గ్యాస్ కంపెనీ యాప్‌ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ప్రొఫైల్ లేదా మై అకౌంట్ విభాగంలోకి వెళ్లి ‘ఈకేవైసీ లేదా రీ వెరిఫికేషన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు కోసం ఆధార్ ఫేస్ ఆర్ డీ యాప్ ఓపెన్ అవుతుంది. ముఖంపై సరిపడా వెలుతురు ఉండేలా చూసుకుని కెమెరా ద్వారా ఫేస్ స్కాన్ పూర్తి చేయాలి. ధ్రువీకరణ విజయవంతమైతే ఈ కేవైసీ పూర్తయినట్లు స్క్రీన్‌పై సమాచారం కనిపించడంతో పాటు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.

అయితే ఫేస్ స్కాన్ చేసే సమయంలో ముఖం స్పష్టంగా కనిపించేలా ఉండాలి. కళ్లద్దాలు, మాస్క్, టోపీ వంటివి తొలగించడం మంచిది. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. అలాగే ఆధార్‌లో నమోదైన వ్యక్తే స్కాన్ చేయాలి. లేదంటే ధృవీకరణ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది ఒకేసారి ఈ కేవైసీ చేయడానికి ప్రయత్నిస్తే సర్వర్‌పై ఒత్తిడి పెరిగి యాప్ నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం తొందరగా లేదా రాత్రి సమయంలో ఈ కేవైసీ ప్రయత్నిస్తే ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper