Homeఅంతర్జాతీయంPakistan PM Shehbaz Sharif: అమెరికాతో అంట కాగారో.. పాకిస్తాన్ పీఎం.. ఆర్మీ చీఫ్ చీఫ్...

Pakistan PM Shehbaz Sharif: అమెరికాతో అంట కాగారో.. పాకిస్తాన్ పీఎం.. ఆర్మీ చీఫ్ చీఫ్ కు లష్కరే తోయిబా హెచ్చరిక

Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్.. ఆర్మీ చీఫ్ మునీర్ కు రోజులు బాగున్నట్టు లేవు. అమెరికాతో అంటకాగుతున్న వారికి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. అమెరికాతో ఇంకా ఎక్కువ రెచ్చిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సంకేతాలు పంపించింది. అమెరికా వద్ద పాకిస్తాన్ ప్రయోజనాలను తాకట్టు పెడితే పరిణామాలు తీవ్రంగా మారుతాయి అని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి కి.. ఆర్మీ చీఫ్ […]

Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్.. ఆర్మీ చీఫ్ మునీర్ కు రోజులు బాగున్నట్టు లేవు. అమెరికాతో అంటకాగుతున్న వారికి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. అమెరికాతో ఇంకా ఎక్కువ రెచ్చిపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సంకేతాలు పంపించింది. అమెరికా వద్ద పాకిస్తాన్ ప్రయోజనాలను తాకట్టు పెడితే పరిణామాలు తీవ్రంగా మారుతాయి అని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి కి.. ఆర్మీ చీఫ్ కు భయం పట్టుకుంది.

అబ్రహం అకార్డ్స్ లో ఇజ్రాయిల్ దేశాన్ని కూడా గుర్తించాలని కొంతకాలంగా అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది.. అంతేకాదు ఇజ్రాయిల్ దేశంతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని సూచిస్తుంది.. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. ఇస్లాం దేశాలు మొత్తం ఇజ్రాయిల్ తో వ్యాపారం నుంచి మొదలుపెడితే దౌత్యం వరకు అన్ని విషయాలలో మెరుగైన సంబంధాలు పాటించాలని చెబుతోంది అమెరికా.. దీనిని ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ మాత్రం ఎటువంటి విషయాన్నీ బయటకి వెల్లడించడం లేదు. నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తీరు పట్ల ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా స్పందించింది.. అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ కనుక తలవంచితే.. అప్పుడు పరిణామాలు అంతకుమించి అనే విధంగా ఉంటాయని లష్కరే తోయిబా హెచ్చరించింది.

ఇటీవల కాలంలో మధ్య ప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య చోటుచేసుకున్న యుద్ధాన్ని తగ్గించేందుకు దాయాది దేశం చర్చలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. అయితే ఇంతవరకు రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసే దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఇది ఇలా ఉండగానే అబ్రహం అకార్డ్స్ విషయంలో అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి పాకిస్తాన్ దేశానికి మింగుడు పడనివ్వడం లేదు. ఒకరకంగా పాకిస్థాన్ పరిస్థితి కుడితి లో పడిన ఎలుక మాదిరిగా ఉంది. ఇప్పటికే ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఒకవేళ అమెరికా విధించిన షరతులకు ఒప్పుకోకపోతే అంతర్జాతీయంగా అప్పులు పుట్టే అవకాశం లేదు. ఉగ్రవాదులను కాదని ముందడుగు వేస్తే బతికే పరిస్థితి ఉండదు.

ఒకవేళ ఉగ్రవాద సంస్థలకు తిక్క రేగితే పాకిస్తాన్ దేశంలో ఏదైనా చేస్తారు. పాకిస్తాన్ దేశం మీద అక్కడి ఆర్మీ కంటే కూడా ఉగ్రవాద సంస్థలకే పట్టు ఎక్కువగా ఉంటుంది. పైగా రాత్రికి రాత్రే వారు ప్రభుత్వాలను మార్చగలరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దలను బహిరంగంగా చంపగలరు. అందువల్లే మునీర్.. షరీఫ్ ఉగ్రవాదులు అంటేనే భయపడిపోతున్నారు. మరి ఈ భయం నుంచి వారికి అమెరికా రక్షణ కల్పించగలదా.. అమెరికాను కాదని వారు నిర్ణయాలు తీసుకోగలరా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper