Homeజాతీయ వార్తలుKarnataka Politics: ఇప్పుడు సిద్ధరామయ్య.. అప్పుడు బంగారప్ప.. నాడు కర్ణాటక లో ఏం జరిగిందంటే..

Karnataka Politics: ఇప్పుడు సిద్ధరామయ్య.. అప్పుడు బంగారప్ప.. నాడు కర్ణాటక లో ఏం జరిగిందంటే..

Karnataka Politics: కొన్నాళ్లు కర్ణాటక రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి. మళ్లీ ఇప్పడు రైజింగ్ వ్యవహారం లాగా మారిపోయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. గతంలో ఒప్పందం జరిగిందని, దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి మార్పు జరుగుతోందని సమాచారం.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఇటువంటి పరిణామమే చోటు చేసుకుంది.1992లో కర్ణాటకలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బంగారప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరుచూ బంగారప్ప మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేసేవారు.

నాడు ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. అప్పడు ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నడ సీమలో జరుగుతున్న వ్యవహారాలు ఆయనకు తీవ్రమైన శిరోభారం లాగా మారాయి. అంత ఇబ్బందిలో కూడా పీవీ నరసింహారావు బంగారప్పను ఢిల్లీ పిలిపించుకున్నారు. నాడు తన ఎదుటకు వచ్చిన ఫిర్యాదులను పీవీ నరసింహారావు చదివి బంగారప్పకు వినిపించారు. పీవీ అలా చేస్తారని బంగారప్ప ఊహించలేదు. ఆయన అలా చదువుతుండగా బంగారప్ప మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని పీవీ చెప్పడంతో బంగారప్ప అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బంగారప్ప బయటకి రాగానే మీడియా చుట్టుముట్టింది. సార్ మీరు రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెప్పకుండానే నేరుగా.. తన మంత్రివర్గం.. ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతేకాదు.. విమానాశ్రయానికి తన మద్దతుదారులు భారీగా రావాలని పిలుపునిచ్చారు. తన బలాన్ని అధిష్టానం ముందు ప్రదర్శించాలని బంగారప్ప అనుకున్నారు. ఆ మరుసటి రోజు బంగారప్ప బెంగళూరు వెళ్ళిపోయారు. విమానాశ్రయం లో దిగారు. ఆయన ఊహించని సన్నివేశం అక్కడ చోటుచేసుకుంది. ఎందుకంటే ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ఉన్నారు. కొంతమంది మద్దతుదారులు మాత్రమే అక్కడ దర్శనమిచ్చారు.

పరిస్థితి అర్థం కావడంతో బంగారప్ప వెంటనే తన రిజైన్ లెటర్ అందజేశారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరప్ప మొయిలీ కర్ణాటక ముఖ్యమంత్రిగా 1992 నవంబర్ 19 ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండవ వ్యక్తి సిద్ధరామయ్య. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
Oktelugu Epaper