Social Updates: మన సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. వారి రోజువారీ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటూ సంబరపడి పోతుంటారు. ఈరోజు కూడా పలువురు హీరో హీరోయిన్లు సరికొత్త అప్ డేట్స్ పోస్టు చేసి అభిమానులు ఖుషీ చేశారు. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా మాళవిక మోహనన్ ఒక పోస్టు చేసింది. అల్లం-పసుపు టీ ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఓ అందమైన పిక్ ను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. Drink Of The Month #immunityup అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.
లంగావోణిలో ఓయలు పోతున్న పిక్స్ ను బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరి పోస్టు చేసింది. Existenece Wants To be You అంటూ స్మైలీ సింబల్ ను పోస్టు చేసింది.
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక పింక్ సారీలో దిగిన ఫోటోలను ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. సారీలో చాలా పిక్చర్స్ తన వద్ద ఉన్నాయంటూ మేనేజ్ చేసింది.
హీరోయిన్ శ్రద్దాదాస్ కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. ‘నేను పంజాబీ పాటలకు పెద్ద అభిమానిని కాదు కానీ.. ఎందుకో ఈ ఏడాది రెండు పంజాబీ పాటలు నన్ను ఆకర్షించాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నారింగ రంగు డ్రెస్సు(విటమన్), సముద్రం తీరం(సీ)ని గుర్తు చేసేలా పోస్టు చేసింది.
హీరో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో జాలీగా కాలక్షేపం చేస్తున్న ఫోటోను పోస్టు చేశాడు. బెస్ట్ టైమ్ పాస్ అంటూ మేసేజ్ చేశాడు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More