Balochistan: భూకంపం వచ్చి.. సర్వనాశనం అయ్యి.. తోటి ఇస్లాం దేశాలు పట్టించుకోకపోతే.. అయ్యో పాపం అనుకుంటూ తుర్కియో మీద మనం జాలి చూపించాం. కానీ పాలు పోసి పామును పెంచితే కాటు వేసినట్టు.. చివరికి ఆ తుర్కియో నెత్తి మాసిన ఉగ్రవాద దేశానికి సపోర్ట్ ఇచ్చింది. మామూలుగా కాదు వెపన్స్.. ఇతర డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్ పోర్ట్ చేసింది. మన అదృష్టం కొద్దీ అవి బార్డర్లో పేలలేదు. ఫలితంగా మనకు పెద్దగా లాస్ కాలేదు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అందువల్లే తుర్కియో మీద మనం కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాం. ఒక రకంగా ట్రేడ్ వార్ కు తెర లేపాం. ఆపిల్స్ వద్దనుకున్నాం. టూరిజం కూడా బంద్ పెట్టాం. ఇప్పటికైతే ఇవి అమల్లో ఉన్నాయి. వచ్చే కాలంలో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేం.
Also Read: నిరుడు ఛాంపియన్..ఈ ఏడు గ్రూప్ దశలోనే.. పాపం కోల్ కతా
మన జెండాను ఎగరవేసింది
బెలూచిస్తాన్ ఇటీవల ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించింది. తనకు తాను స్వాతంత్రం ప్రకటించుకుంది. దశాబ్దాలుగా దిక్కుమాలిన ఉగ్రవాదు దేశంతో పోరాటం చేసి చివరికి తనకు తానుగా ఇండిపెండెన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఆదేశం మొత్తం సెలబ్రేషన్ మోడ్ లో ఉంది. ఈ క్రమంలోనే బెలూచిస్తాన్ చేసిన పోరాటానికి ఇండియా సపోర్ట్ చేసింది. తెర వెనుక అండగా నిలబడింది. తనకు చేసిన సహాయానికి గుర్తుగా బెలూచిస్తాన్ ఇండియన్ గవర్నమెంట్ ను 1000 నోళ్ళతో పొగుడుతోంది. ఆకాశమంత కీర్తిని అందిస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక ఇండియన్ గవర్నమెంట్ చేసిన పనికి ఉప్పొంగిపోతున్న బెలూచిస్తాన్.. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్ ను బెలూచిస్తాన్ వీధులలో ప్రదర్శన చేస్తోంది. ఇండియన్ ఫ్లాగ్స్ కు సెల్యూట్ చేస్తూ.. త్రివర్ణ పతాక గౌరవాన్ని మరింత పెంచుతోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతోంది. ” మేము స్వేచ్ఛగా ఉన్నాం. స్వాతంత్ర తను ఎన్నో కష్టాలు పడి సాధించాం. చివరికి ఇలా మా బతుకు మేము బతుకుతున్నాం. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఇండియాకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని” బెలూచిస్తాన్ ప్రజలు పేర్కొంటున్నారు.
ఇప్పుడు మాత్రమే కాదు.. భవిష్యత్తు కాలంలోనూ ఇండియా మాకు అండగా ఉంటుందని బెలూచిస్తాన్ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇండియా తమ పునర్నిర్మాణంలో సహకారాలు అందిస్తుందని వారు నమ్ముతున్నారు. ఇండియా గొప్ప దేశమని.. తమకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కల్పించిన దేశం అని పేర్కొంటున్నారు. అందువల్లే ఇండియాను తమకు అత్యంత ఇష్టమైన, నమ్మకమైన భాగస్వామిగా బెలూచిస్తాన్ వాసులు పేర్కొంటున్నారు. ఇండియా చెప్పినట్టుగానే తాము నడుచుకుంటామని వారు వివరిస్తున్నారు. ఇండియా ఆధ్వర్యంలో తాము గొప్ప దేశంగా అవతరిస్తామన్న నమ్మకం ఉందని వారు పేర్కొంటున్నారు.
“ఆపరేషన్ సింధూర్” ఇచ్చిన ధైర్యంతో పాకిస్తాన్ నుండి విడిపోయి, బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం గా మారిన సందర్భంగా,కృతజ్ఞతతో మన దేశ జాతీయ పతకాన్ని ఎగురవేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యం
భారత్ మాతాకి జై pic.twitter.com/SoNxwVkHQf
— JSP Naresh (@JspBVMNaresh) May 18, 2025