Muslims : తెలంగాణ ముస్లిం జేఏసీ చేసిన ప్రకటన సంచలనమైంది. మా ముస్లిం సంస్థలన్నీ కలిసి సమష్టిగా ఓ నిర్ణయం తీసుకున్నామని.. ఈసారి తాము గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓటు వేయబోతున్నామని ప్రకటించాయి. మత పరంగా ఒక రాజకీయ పార్టీకే ఓటు వేయాలనడం కొత్తేమీ కాదు.
ఉత్తర భారతదేశంలో ఢిల్లీ జుమామసీదు ఇమామ్ పిలుపు కోసం ఉత్తరభారతంలోని ముస్లింలు ఎదురుచూస్తుంటారు. ఆయన ఎవరికి ఓటు వేయమంటే వారికి ముస్లింలు వేయరు. వాళ్లు గెలవలేదు. మతాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయమనడం.. మతవాదం కాదా? దీన్ని సెక్యూలర్ అంటారా?
బీజేపీ ఏదైనా మాట మాట్లాడే విరుచుకుపడేవాళ్లు.. కాంగ్రెస్ పార్టీ స్వయంగా మతవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఎవరూ ఏం మాట్లాడడం లేదు. దీన్ని ఎందుకు ఖండించరు.. ఉదారవాదం.. సెక్యులరిజం పేరుతో చేస్తున్న ఆగడాలు ఎందుకు ఖండించరు?
ముస్లింలందరూ కలిసి కట్టుగా ఒకే పార్టీకి ఓటు వేయమని చెప్పడం మతవాదం కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.