Homeజాతీయ వార్తలుBypoll Results : దేశంలో ఉప ఎన్నికలు.. బీజేపీకి డేంజర్ బెల్ మోగిందా..

Bypoll Results : దేశంలో ఉప ఎన్నికలు.. బీజేపీకి డేంజర్ బెల్ మోగిందా..

Bypoll Results : ఇటీవల బిహార్‌లోని బాంకిపూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనమైన మెజారిటీతో ఓడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. అదే సమయంలో గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మూడు ఫలితాలు కలిపి చూస్తే రాజకీయ పార్టీలకు కొన్ని స్పష్టమైన పాఠాలు కనిపిస్తున్నాయి. విపక్షాలకు మూడు కీలక సందేశాలు – ఎన్నికల యంత్రాంగం, […]

Bypoll Results : ఇటీవల బిహార్‌లోని బాంకిపూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనమైన మెజారిటీతో ఓడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. అదే సమయంలో గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మూడు ఫలితాలు కలిపి చూస్తే రాజకీయ పార్టీలకు కొన్ని స్పష్టమైన పాఠాలు కనిపిస్తున్నాయి.

విపక్షాలకు మూడు కీలక సందేశాలు
– ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితా, ఈవీఎంలు ఒకేలా ఉన్నా కూడా ఫలితం మారవచ్చు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ తర్వాత తయారైన ఓటర్ల జాబితాతోనే బీజేపీని ఓడించగలిగిన సందర్భం ఇది. కేవలం సాంకేతిక అంశాలపై ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పని చేస్తే ఫలితం వస్తుందని ఈ ఎన్నికలు చూపించాయి.

– బాంకిపూర్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ నేరుగా ప్రజలను కలుస్తూ, ఓటరు నుంచి ఓటరు, బూత్‌ నుంచి బూత్, గ్రామం నుంచి గ్రామం వరకు కదిలిన వ్యూహం ఫలించింది. గతంలో ఎనిమిది సార్లు బీజేపీ గెలిచిన స్థానంలో ఈసారి మార్పు వచ్చింది. బీజేపీ సాధారణంగా 35–38 శాతం ఓట్లు పొందుతుందని, మిగతా ఓట్లను ఏకం చేస్తే విజయం సాధ్యమని ఈ ఫలితం నిరూపించింది. రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉండటం కూడా అతనికి అనుకూలంగా పనిచేసింది.

– పోటీలోకి దిగే ముందే ఇతర పార్టీలతో చర్చలు జరిపి వారిని ప్రచారం నుంచి దూరంగా ఉంచడం వల్ల ఓట్లు చీలకుండా ఉండటం సాధ్యమైంది. ఆర్జేడీ కూడా నామమాత్రంగా పాల్గొనడంతో ప్రధాన అభ్యర్థికి అనుకూల పరిస్థితి ఏర్పడింది.

బీజేపీకి మూడు గుణపాఠాలు
– బాంకిపూర్‌లో నామినేషన్ల చివరి రోజున అభ్యర్థిని మార్చడం వల్ల కొత్త వ్యక్తికి ప్రచారానికి సమయం లేకపోయింది. దతియాలో మాజీ మంత్రిని పక్కన పెట్టి కొత్తవారికి టికెట్‌ ఇవ్వడం వల్ల అతను రెబల్‌గా బరిలోకి దిగి నియోజకవర్గంలో అస్థిరత సృష్టించాడు. పార్టీ ఐక్యతకు చిహ్నంగా ఉన్న బీజేపీలోనే ఎన్నికలకు ముందు చీలిక ఏర్పడింది. ఎవరినైనా నిలబెట్టి గెలవవచ్చనే భావన ప్రమాదకరమని ఇది చూపించింది.

– పెద్ద నాయకులు గణనీయంగా రంగంలోకి దిగకపోవడం, స్థానిక సమస్యలపై దృష్టి సారించకపోవడం ఓటమికి దోహదం చేశాయి.

– ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో 25 రోజులు ఢిల్లీలో కాక్రోచ్‌ జనతాపార్టీ నిరసన తెలిపింది. కానీ ఈ ప్రభావం ఎన్నికలపై పడలేదు. అక్కడి ప్రజలు స్థానిక సమస్యలు అడిగారు. అభిజిత్‌ దీప్కే గురించి దహియా గురించి అడగలేదు.

– గుజరాత్‌లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఘన విజయం సాధించి కాంగ్రెస్‌ను ఓడించింది. అయితే బిహార్, మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలను తేలికగా తీసుకోవడం వల్ల నష్టపోయింది. భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రతీ ఉప ఎన్నికను కూడా పూర్తి స్థాయి పోరాటంగా చూడాలని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ మూడు ఉప ఎన్నికలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. రాజకీయ విజయం కేవలం అధికారం లేదా గత రికార్డులపై ఆధారపడదు. క్షేత్రస్థాయి పని, సరైన అభ్యర్థి ఎంపిక, పార్టీ అంతర్గత ఐక్యత, స్థానిక సమస్యలపై దృష్టి ఇవన్నీ కలిసి నిర్ణయించేవి. విపక్షాలు ఈ పాఠాలను స్వీకరిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఈ ఓటములను గుణపాఠంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను మెరుగుపరచుకుంటే తన పటిష్టతను కాపాడుకోగలదు. ఉప ఎన్నికలు చిన్నవి అయినా, అవి పెద్ద పాఠాలను నేర్పుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper