‘షాహిది దివస్’సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రినరేంద్ర మోడీ శనివారం సిక్కు గురువు తేగ్ బహదూర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘గురుతేగ్ బహదూర్ జీవితం ధైర్యం, కరుణను సూచిస్తుంది, అతని సాహిది దివస్ సందర్భంగా ప్రణామాలు చేపడుతున్నా. న్యాయమైన సమాజం కోసం గురుతేజ్ క్రుషి చేశారు.’ అని ట్వీట్ చేశారు. 10 మంది సిక్కు గురువులలో తొమ్మిదవ వ్యక్తి గురు తేగ్ బహదూర్. ఈయన 1621లో జన్మించారు. 1675లో అమరుడయ్యారు.