
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,036 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కి చేరింది. ఇందులో 98,83,461 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,54,254 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 256 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,48,994కి చేరింది. ఇక ఇదిలా ఇండియాలో కరోనా రికవరీ రేటు 96.08శాతంగా ఉంటె, యాక్టివ్ కేసులు 2.47శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.45శాతానికి పడిపోయింది.