
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,11,724 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 670 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,24,985కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,20,773 యాక్టివ్ కేసులు ఉండగా.. 77,65,966మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా కరోనా రికవరీ రేటు 92.32 శాతం ఉండగా మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.