
సాధారణంగా ఎవరైనా మృతి చెందితే సానుభూతితో వారి కుటుంబ సభ్యులను నిలబెట్టి ప్రత్యర్థి రాజకీయపార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండి సహకరిస్తాయి. గతంలోనూ టీడీపీ ఇలా చేసింది. కానీ ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి మాత్రం ముందుగానే ప్రకటించి ప్రత్యర్థులైన వైసీపీ, బీజేపీకి గట్టి షాకిచ్చారు.
Also Read: ఇక బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్మాయం కాదా?
వైసీపీ సిట్టింగ్ ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఈ తిరుపతి ఎంపీ సీటుకు జనవరి తర్వాత ఉప ఎన్నిక జరగవచ్చు. ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వుడు అయిన ఈ సీటుపై అందరికంటే ముందే సర్దుకొని చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడం విశేషంగా మారింది. టీడీపీలో ప్రస్తుతం ఉన్న కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మీ తిరుపతి టికెట్ కోసం బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం సాగడంతో చంద్రబాబు ఆగమేఘాల మీద స్పందించి ఏకంగా ఆమెను అభ్యర్థి ప్రకటించి రాజకీయంగా సంచలనం సృష్టించారు.
Also Read: చీఫ్ జస్టిస్ కు లేఖ: జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే చంద్రబాబు తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే బీజేపీ ఇక్కడ పోటీకి సై అనగా.. అధికార వైసీపీ కూడా దూకుడుగా ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి వచ్చారు. టీడీపీ తరుఫున తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీచేసి గతంలో ఓడిపోయిన కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మీని తాజాగా టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించి సంచలనం సృష్టించారు.బీజేపీ తన్నుకుపోయేలా ఉందన్న వార్తల నేపథ్యంలో పనబాకనే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషంగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం
పనబాక లక్ష్మీ టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. వెంటనే పావులు కదిపి తిరుపతి బరిలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించారు. లోక్ సభ నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేశారు. ఇప్పటిదాకా సమాయత్తమే కానీ ప్రత్యర్థి వైసీపీ, బీజేపీలకు చంద్రబాబు వేసిన స్టెప్ నిజంగానే షాకిచ్చినట్టైంది.