
ఏపీలో తొలి పంచాయితీ ముగిసింది. తాజాగా రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రెండో విడతలో తెలంగాణ 3335 పంచాయితీల సర్పంచ్ లకు, 33632 వార్డులకు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు.
రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్లి నుంచి 4వ తేదీ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగనుంది. నామినేషన్లు వేయటం అయిపోయిన వెంటనే 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు పరిశీస్తారు. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు నామినేషన్ల ఫైనల్ జాబితాను అధికారులు ప్రకటిస్తారు. 13వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రంలోపు ఫలితాలను ప్రకటిస్తారు.
ఇప్పటికే రాష్ట్రంలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి విడతలో ఏపీ వ్యాప్తంగా 3249 పంచాయితీలు, 32504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఫిబ్రవరి 9న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.