Homeజనరల్మృత్యు దోషం ఉన్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..?

మృత్యు దోషం ఉన్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..?

Astrology

సాధారణం మనలో చాలామందికి జాతకాలు చూపించుకోవడం అలవాటుగా ఉంటుంది. ఆ విధంగా మన జాతకం లో ఏమైనా దోషాలు, మృత్యు గండం ఉన్నాయని తెలిస్తే ఆ దోషాల నుంచి తప్పించుకోవడం కోసం పరిహారాలు చేస్తుంటాము. అలాంటి దోషాల నుంచి చి పరిహారం చేసుకోవడం కోసం ఎన్నో గుళ్ళు, గోపురాలు, పూజలు నిర్వహిస్తాము. అయితే కొన్నిసార్లు ఎలాంటి పూజలు చేసిన ప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఈ దోషాలు అన్నింటిని తొలగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే సులువైన మార్గం మన పురాణాలలో ఒక మార్గం ఉంది. అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని సూచించే లక్షణాలివే..?

సాధారణంగా మన జీవితంలో దోషాలు గండాలు అనేవి మన జన్మ నక్షత్రం పై ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా ఒక్కో నక్షత్రం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే నక్షత్రాలలో రెండవ నక్షత్రమైన భరణి నక్షత్ర రోజున సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో అలాంటి వారికి అకాల మృత్యు భయం ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read: తరచూ కోపం వస్తోందా.. మీలో ఈ సమస్య ఉన్నట్టే..?

భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిపతి. కనుక భరణి నక్షత్రం నందు ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగే యమగండాలు, మృత్యు దోషాలు తొలగిపోతాయి.అదే విధంగా భరణి నక్షత్రం రోజు ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.ఈ విధంగా కుబేరుని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.అందుకోసమే భరణి నక్షత్రం రోజు వెంకటేశ్వరస్వామి దర్శించటం వల్ల జాతక దోషాలు, మృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular