సాధారణంగా అన్నంను వేడి చేసిన తర్వాత.. వెంటనే ఫ్రైడ్ రైస్ తయారు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఒకసారి వేడి చేసిన ఆహారాన్ని కనీసం రెండు గంటల పాటు నిల్వ ఉంచడంతో ఇందులో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఎన్ని డిగ్రీల్లో వేడి చేసిన కూడా చనిపోకుండా ఉండే అవకాశం ఉందని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. ఈ బ్యాక్టీరియా ఇలాగే ఉండి ఆహారంలో కలిసిపోతుంది. అప్పుడు ఫ్రైడ్ రైస్ తిన్నవారిలో అనేక విష పదార్థాలను విడుదల చేస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇలాంటి ఫ్రైడ్ రైస్ తినడం వల్ల కొందరికి వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం ఏర్పడతాయి. మరికొన్ని గంటల తర్వాత విరోచనాలు, కడుపునొప్పి, లేదా పొట్టలో సమస్యలు ఉంటాయి. అయితే కొందరు పదేపదే ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు ఇందులో నూనె, ఉప్పు, సాస్, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి అధిక కేలరీలతో పాటు, సోడియం ను ఎక్కువగా కలిగి ఉంటాయి. దీంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే బయట లభించే నీ ఫ్రైడ్ రైస్ లో ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పలేం. కానీ కొందరు సరైన ప్రమాణాలతో దీన్ని తయారు చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభ్రత లేని ప్రదేశంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వరకు అలాగే ఉంచితే కూడా ఈ సమస్యలు ఉంటాయి. అందువల్ల బయట లభించే ఫ్రైడ్ రైస్ కు ఎక్కువగా అలవాటు పడకుండా.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే ఇకనుంచి అయినా.. సాత్విక ఆహారం లేదా రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆయిల్, ఉప్పు ఎక్కువగా కలిగిన ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.