Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : జగన్- కేటీఆర్.. తెరవెనుక ఏదో జరుగుతోందబ్బా..

YS Jagan Mohan Reddy : జగన్- కేటీఆర్.. తెరవెనుక ఏదో జరుగుతోందబ్బా..

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ఐటి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కు ఒకరికి పరస్పరమైన అభిమానం ఉంది. దీనిని బహిరంగంగానే వారిద్దరూ వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిద్దరు ఒకరు ఒకరు అత్యంత గౌరవంగా సంబోధించుకుంటూ ఉంటారు. ఒకరి గురించి మరొకరు గొప్ప విషయాలు చెప్పుకుంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. జగన్ అంత ఎత్తునుంచి బంగి జంప్ ఎలా చేశారో అర్థం కావడం లేదని.. ఈసారి కలిస్తే కచ్చితంగా అడుగుతానని అన్నారు. అంతకుముందు వీరిద్దరూ బెంగళూరులో ఆ ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు.

వారిద్దరు కలుసుకొని మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన విషయాలను అటు నమస్తే తెలంగాణ.. ఇటు సాక్షి గొప్పగానే చెప్పుకున్నాయి. గొప్పగానే రాశాయి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. సాక్షి పేపర్ పెద్దగా నెగిటివ్ వార్తలు రాయలేదు. 2014లో గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరినప్పుడు కూడా సాక్షి పెద్దగా వ్యతిరేక వార్తలు రాలేదు. జగన్ నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారంతా కూడా గులాబీ పార్టీలోకి చేరిపోయారు. దీనికి తోడు నాడు కెసిఆర్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రగతి భవన్ వచ్చారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. 2023లో భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టింది. కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీలో పర్యటించారు. నాడు మంత్రిగా ఉన్న రోజా ఇంటికి వెళ్లారు. ఆమె పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు. నాడు కెసిఆర్ వెంట కవిత కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏపీ రాష్ట్రంలో పనిచేస్తామని.. ఏపీ రాష్ట్రం రూపురేఖలు మార్చుతామని కెసిఆర్ అన్నారు.

ఈ ప్రకారం కేసీఆర్ కుటుంబానికి.. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సర్ నిబంధన మీద అవగాహన కల్పించడానికి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. జగన్, కేటీఆర్ ఫోటోలను పక్కపక్కన ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ ఫోటోలు గులాబీ పార్టీ, వైఎస్ఆర్ సీపీ మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి మీడియా ఈ చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తామని. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండు పర్యాయాలు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీ, వైసీపీల మధ్య సంబంధాలు కుదిరినట్టు బహిరంగంగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష పొత్తు కాక పోయినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కార్యకలాపాలను దగ్గరుండి పరిశీలిస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper