Homeజాతీయ వార్తలుBank Merger Rumours : ఆ మూడు బ్యాంకులు విలీనం.. ఇకపై ఉండేది ఒకటే.. కేంద్రం...

Bank Merger Rumours : ఆ మూడు బ్యాంకులు విలీనం.. ఇకపై ఉండేది ఒకటే.. కేంద్రం కీలక ప్రకటన

Bank Merger Rumours : అప్పట్లో కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ బ్యాంకుల విలీనం సాధ్యం కాలేదు. అప్పట్లో విలీనమైన జాబితాలో ఆంధ్రా బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలినమైంది. ఆంధ్ర బ్యాంకు లో ఉన్న డిపాజిట్లు.. ఆస్తులు.. ఇతర వ్యవహారాలు యూనియన్ బ్యాంక్ పరిధిలోకి వచ్చాయి.

మళ్లీ ఇప్పుడు కూడా దేశంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం అవుతాయంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అవుతాయని.. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఇటువంటి అంశం ఏదైనా ఉంటే ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. కానీ ఈసారి అలాంటిదేమీ లేకుండా ఈ మూడు అతిపెద్ద బ్యాంకులు విలీనం కావడం ఒకరకంగా సంచలనమే. ఇప్పటికిప్పుడు ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ.. ఇతర ఫైనాన్స్ భాగాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ మూడు బ్యాంకుల విలీనం మీద కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కెనరా బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సందేశాలు మొత్తం ఫేక్ అని స్పష్టం చేసింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని పి ఐ బి ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా వేగంగా ఒక పోస్ట్ చేసింది. బ్యాంకుల విలీనానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్బిఐ వెబ్సైట్లో ఉంటుందని.. అనుమానాస్పదమైన సమాచారాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే 8799 711 259 వాట్స్అప్ నెంబర్లు సంప్రదించాలని.. ఒకవేళ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి మెసేజ్ కూడా చేయవచ్చని సూచించింది. అయితే కొంతకాలంగా ఇటువంటి నిరాధారమైన సమాచారాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. దానిపై అధికారికంగా ఎస్బిఐ లేదా మిగతా బ్యాంకులు ప్రకటన చేయలేదు. దీంతో ఇటువంటి నిరాధారమైన సమాచారాన్ని స్ప్రెడ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
image.png

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper