
దేశంలో కరోనా మహమ్మాచి రెండో దశ రికార్డు స్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరింది. కొత్తగా 2,17,113 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110చేరి 83.49 శాతానికి తగ్గింది.