కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద్ వ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొవిడ్-19 మహమ్మారిని నిలువరించే విషయంలో కేంద్రం అలసత్వం కారణంగా దేశం పరువు పోయిందంటూ దుయ్యబట్టారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలపై అంతర్జాతీయ దినపత్రికలు సైతం వార్తలు వెలువరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.