Independence Day : టెర్రరిస్ట్ ఇంటి మీద జాతీయ జెండా.. మన తెలుగు మీడియా పట్టించుకోలేదు.. నేషనల్ మీడియా అంతగా ఫోకస్ చేయలేదు. కానీ సోషల్ మీడియా ఊరుకోదు కదా.. సోషల్ మీడియాకు రాగద్వేషాలు ఉండవు కదా.. అందుకే ఈ విషయం మీద ఫోకస్ పెట్టింది. లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడుగాని మోడీ గొప్పతనం తెలిసింది.
కొంతమందికి మోడీని తిట్టడమే పని. ఇంకొంతమందికి మోడీని విమర్శించడమే అలవాటు. కానీ మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంత లాభదాయకమో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. జమ్ము కాశ్మీర్ తెలుసు కదా.. అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినప్పటికీ.. ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పటికీ.. ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు వారు దాడులు చేస్తూనే ఉన్నారు. సరిహద్దుల్లో భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. ఇది మన సో కాల్డ్ జాతీయ మీడియాకు.. తెలుగు మీడియాకు పట్టదు. ఎంతసేపటికి కుటుంబ పార్టీలకు జై కొట్టడం.. రాజకీయ నాయకులకు ఊడిగం చేయడమే ఆ మీడియాకు తెలిసింది. ఇంతకంటే కఠినంగా మాట్లాడొచ్చు. కానీ కొన్ని పరిమితుల వల్ల పొలైట్ వర్డ్స్ ఉపయోగించాల్సి వస్తోంది.
జమ్మూ కాశ్మీర్లో షోఫియాన్ అనే ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టాప్ కమాండర్ అబీద్ రంజాన్ కుటుంబ సభ్యులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. ఉగ్రవాది ఇంటి మీద జాతీయ జెండా అర్ రెపరెపలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఆబిద్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటున్నాడు. స్థానికేతర కార్మికులపై దాడులు చేస్తున్నాడు. ఇతడు భద్రత దళాల వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
కొంతకాలంగా ఉగ్రవాదుల తల్లిదండ్రులను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. వారికి తమ దేశం గొప్పతనం గురించి వివరిస్తోంది. ఉగ్రవాదం వల్ల ఎంత నష్టం వాటిల్లుతోందో చెబుతోంది. సైన్యం పరంగా సహకారం కూడా అందిస్తోంది. నిత్యవసరాలు.. చదువు.. వైద్యం అంటివి అందిస్తోంది. దీంతో ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు.. బంధువులలో మార్పు వస్తోంది. వాస్తవానికి ఈ విధానం ద్వారానే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయవచ్చని అప్పట్లో అంతర్గత సమావేశంలో మోడీ భారత సైన్యాధికారులతో వివరించారు. అప్పటినుంచి దీనిని అమలు చేస్తున్నారు. అందువల్లే ఉగ్రవాదుల బంధువులు.. తల్లిదండ్రులలో మార్పు వచ్చింది.
ఇంతటితోనే మోడీ ఆగిపోలేదు. పాకిస్తాన్ కేంద్రంగా కార్యాలపాలు సాగిస్తూ.. ఇండియా మీద నిత్యం దాడులు చేసే ఉగ్రవాదులను అజ్ఞాత వ్యక్తులు చంపేస్తున్నారు. ఇప్పటివరకు 38 మంది ఉగ్రవాదులను ఇలానే చంపేశారు. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన లెక్కలు మాత్రమే. వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఉగ్రవాదం అనేది ఒక రాచ పుండు. దానిని ఆదిలోనే రూపుమాపాలని మోడీ గట్టి ప్లాన్ తో ఉన్నారు. అందువల్లే ఉగ్రవాదుల గృహాల మీద జాతీయ జెండాలు ఎగురుతున్నాయి.