
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంట్లో మరో 4,01,708 కరోనా కేసులు నమోదు కాగా కరోనా 4,187 మంది మరణించారు. భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 2,18,92,676 కరోనా కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2,38,270 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి.