హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయన ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయం కోసం తెరాస ప్రజా వ్యతిరేఖ విధానాలు అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దే అని ఈటల ఆరోపించారు.