Sarigamapa: ‘జీ తెలుగు’ ఛానల్ లో అత్యంత ప్రజాధారణ పొందిన ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం చాలా తొందరగా ముగియడం తో ప్రేక్షకులు చాలా నిరాశకు గురయ్యారు. అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నప్పటికీ , ఎందుకు ఈ షో ని ఇంత తొందరగా ముగించారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జీ తెలుగు ఛానల్ వాళ్ళను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. సుడిగాలి సుధీర్ , అనిల్ రావిపూడి కలిసి చేసే కామెడీ ని బాగా మిస్ అవుతున్నాం, మళ్లీ వీళ్ళ కాంబినేషన్ ని చూసేది ఎప్పుడో అంటూ నిరాశ వ్యక్తం చేశారు. అలా నిరాశకు గురైన ఆడియన్స్ కి ఇప్పుడొక శుభ వార్త. ఈ ఆదివారం రాత్రి 9 గంటల నుండి ‘సరిగమప ‘ సరికొత్త సీజన్ ప్రారంభం కానుంది. గతం లో ప్రసారమైన సీజన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సీజన్ లో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా , అనిల్ రావిపూడి , ఎస్పీ శైలజ , అనంత్ శ్రీరామ్ జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. మరోసారి అనిల్ రావిపూడి , సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని చూడబోతున్నాము అన్నమాట. వీళ్లకు అనంత్ శ్రీరామ్ తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి గత సీజన్ లో ఏ రేంజ్ కామెడీ ని పండించారో మనమంతా చూసాము. మరోసారి వీళ్ళ సందడి ని ఎంజాయ్ చేయబోతున్నాము. ఇదంతా పక్కన పెడితే గత సీజన్ లో ‘యాదమ్మ రాజు’ స్పెషల్ స్కిట్స్ ఈ షోలో ఉండేవి. కానీ ఈ సీజన్ లో ‘యాదమ్మ రాజు’ కి బదులుగా , ఇమ్మానుయేల్ కనిపించబోతున్నాడు. ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఇమ్మానుయేల్ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
గత బిగ్ బాస్ సీజన్ లో ఆయన కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఇమ్మానుయేల్ కూడా ఒకడు. ఈయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. అలాంటి ఇమ్మానుయేల్ , కామెడీ కింగ్ సుడిగాలి సుధీర్ తో కలిస్తే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించగలమా?, మరో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకోబోతున్న షోగా ‘సరిగమప’ లేటెస్ట్ సీజన్ నిలవబోతుంది. అయితే ఈ సీజన్ అయినా ఎక్కువ రోజులు ఉంటుందా?, లేదా చిన్న సీజన్ గా మిగలబోతుందా అనేది చూడాలి. ఇకపోతే మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో పై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.