
ఢిల్లీలో బంగారం ధర వరుసగా రెండో రోజూ పెరిగింది. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 222 పెరిగి రూ. 45,586కు చేరింది. క్రితం ట్రెడ్లో తులం బంగారం ధర రూ. 45,364 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర పెరగడం, రూపాయి మారకం విలువ కొంత బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని తెలుస్తోంది. అదేవిధంగా వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి రూ. 100 పెరిగి రూ. 61,045 పలికింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 60,945 వద్ద ముగిసింది.