
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90,204 పరీక్షలు నిర్వహించగా 2,591 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,29,579 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,057కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 3,329 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,90,565కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.